నవతెలంగాణ – హైదరాబాద్: రేపు (7వ తేదీన) పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను www.bse.telangana.gov.in, results.bsetelangana.org అనే వెబ్సైట్లలో చూసుకోవచ్చు. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 14 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే.