ఫుకుషిమా విపత్తుకు 12 ఏండ్లు

టోక్యో: తీవ్ర భూకంపం కారణంగా ధ్వంసమైన ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంట్‌ నుండి కలుషితమైన అణు ధార్మిక జలాలను పసిఫిక్‌ సముద్రంలోకి విడుదల చేయవద్దం టూ జపాన్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ వ్యర్ధ జలాలను సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్‌ ప్రభుత్వం యోచి స్తోంది. కాగా స్థానికులు మాత్రం ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నారు. జపాన్‌లో అతిపెద్ద భూకంపం వచ్చి శనివారం నాటికి 12 ఏళ్ళు గడిచాయి. ఈ నేపథ్యంలో సముద్రాన్ని డస్ట్‌ బిన్‌గా మార్చవద్దంటూ నినాదాలు ఊపందుకుంటు న్నాయి. టోక్యో టెప్కో ప్రధానకార్యాలయం ఎదురుగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి తమ వ్యతిరేకత తెలియచేశారు. అణు ధార్మికత కలిగిన జలాలను సముద్రంలోకి విడిచిపెట్టడం పెద్ద నేరమని అన్నారు.

Spread the love