జేఈఈ అడ్వాన్స్ కి అర్హత సాధించిన 15 మంది విద్యార్థినులు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
గురువారం ప్రకటించిన జె ఈ ఈ మెయిన్స్ ఫైనల్ ఫలితాల్లో డిచ్ పల్లి మండలం లోని దర్మారం బీ సాంఘీక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థినులు మంచి ప్రతిభను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ బి.సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. జెఈఈ మెయిన్స్ లో 15 మంది విద్యార్ధినులు జె ఈ ఈ అడ్వాన్స్ కి అర్హత సాధించారని తెలిపారు. కళాశాల లోని టాప్ 5 విద్యార్ధినుల పర్సంటైల్  బి.వర్ష -92.44, టి.తేజశ్రీ-90.87, ఎన్.కృతగ్న-86.76, వై. సంధ్య – 85.71, ఎం.అపూర్వ -79.46. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రతిభ కనబరచిన విద్యార్తినులను కళాశాల ప్రిన్సపల్,అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు.
Spread the love