స్కూల్‌బస్సు బోల్తాపడి .. తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులు

నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బోల్తా  పడింది. దీంతో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మౌంట్‌ బాసిల్‌ స్కూల్‌కు చెందిన బస్సు జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ మార్గంలో కొత్త తండా వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో బస్సులో విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికులతో సహాయకచర్యలు చేపట్టారు. విద్యార్థులను దవాఖానకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

Spread the love