– అప్పులతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
నవతెలంగాణ-సదాశివపేట
క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని.. అప్పులు పెరగడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శనివారం జరిగింది. సదాశివపేట సీఐ మహేష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చింత వినీత్(25) అప్పులు తెచ్చి క్రికెట్ బెట్టింగ్లో పెట్టేవాడు. ఈ క్రమంలో మొత్తంగా అతడు రూ.25లక్షలు అప్పు తెచ్చి బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తెచ్చిన అప్పులు చెల్లించే దారిలేక వినీత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తాత చింత వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.