న్యూఢిల్లీ : ఇన్సూర్ టెక్ అగ్రగామి సంస్థ రెన్యూబై సిరీస్ డి ఫండింగ్ రౌండ్లో రూ.330 కోట్లు (40 మిలియన్ డాలర్లు) నిధులు సమీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. జపనీస్ ఇన్సూరెన్స్ సంస్థ దాయిఇచి లైఫ్ హోల్డింగ్స్ ఇన్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు పొందినట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, ఉత్పాదన, సాంకేతిక విధులను మెరుగుపరచడం కోసం ఉపయోగించనున్నట్లు రెన్యూబై సిఇఒ బాలచందర్ శేఖర్ తెలిపారు. తమ సంస్థ 40 కంటే ఎక్కువగా బీమా సంస్థలతో కలిసి పని చేస్తుందన్నారు.