– దమ్మపేట మండలంలో అత్యధికం 1652 మంది
– అన్నపురెడ్డిపల్లి లో అత్యల్పం 639 మంది
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ నెల 27 న జరగనున్న నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజక వర్గం ఉప ఎన్నికలో అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 5,151 మంది పట్టభద్రులు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజక వర్గంలోని దమ్మపేట మండలంలో అత్యధికంగా 1652 మంది,అన్నపురెడ్డిపల్లి మండలంలో అత్యల్పంగా 639 మంది పట్టభద్రులు నమోదు అయ్యారు.నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట 1263 పట్టభద్రుల ఓటర్లు తో రెండో స్థానంలో ఉండగా,ములకలపల్లి మండలం 808 మంది ఓటర్లు తో మూడో స్థానంలో ను,789 మంది ఓటర్లు తో చండ్రుగొండ నాలుగో స్థానంలో ఉన్నాయి.
మండలం పట్టభద్రులు
దమ్మపేట 1652
అశ్వారావుపేట 1263
ముల్కలపల్లి 808
చండ్రుగొండ 789
అన్నపురెడ్డిపల్లి 639
మొత్తం 5151