నవతెలంగాణ – హైదరాబాద్: మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో ఈరోజు ఉదయం 10:19 గంటలకు ప్రమాదం జరిగింది. మయన్మార్ నుంచి వచ్చిన ఆర్మీ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి భారత్లోకి చొరబడి తమ దేశ సైనికులను వెనక్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. భారత్లోకి చొరబడిన మయన్మార్ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య అంతర్యుద్ధం జరగుతున్నది.