- Advertisement -
నవతెలంగాణ – రెంజల్ : మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన ఆసాని అనిల్ కుమారుడు ఎంసెట్లో 2832 ర్యాంకు సాధించడంతో, ఆయనకు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి శాలు ఒక కప్పి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, తహసిల్దార్ శ్రవణ్ కుమార్, జడ్పిటిసి నాగభూషణం రెడ్డి, జి సాయి రెడ్డి, సాయిబాబాగౌడ్ఆసాని అనిల్, సాయ గౌడ్, గంగా కృష్ణ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -