- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మాదన్ ఇప్పర్గా మాజీ సర్పంచ్ రాజు పటేల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల పట్ల పోరాడుతానని తెలిపారు. డోంగ్లి మండల పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



