నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభవార్త. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్నారు. ఫలితాల విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలని తొలుత భావించినప్పటికీ, ఆ గడువు కంటే ముందే ఫలితాలను విడుదల చేస్తుండటం గమనార్హం.
రేపే టెన్త్ ఫలితాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



