- Advertisement -
కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని మండలంలోని కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్లో ఉప సర్పంచ్ సభవత్ సవేందర్, ఎస్ఐ-2రాజన్ కుమార్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



