అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 11.75 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. 2026-27వ ఆర్థిక సంవత్సరంలో కూడా రెండంకెల వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 2026-27 ఏడాదిలో కూడా 10.75 శాతం మేర వృద్ధి నమోదవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసిందని చెప్పారు. 2025-26వ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తెలిపారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదనీ, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని మంత్రి పయ్యావుల చెప్పారు.
మొత్తం బడ్జెట్ : రూ.3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ. 2,56,143 కోట్లు
మూలధన వ్యయం : రూ. 53,915 కోట్లు
రెవెన్యూ లోటు : రూ. 22,002 కోట్లు
ద్రవ్య లోటు : రూ. 75,868 కోట్లు
ఏపీ బడ్జెట్ రూ.3,32,205 కోట్లు
- Advertisement -
- Advertisement -



