11 గంటలకు కౌన్సిలర్ ల ప్రమాణస్వీకారం
12 : 30 కి ఛైర్పర్సన్ ఎంపిక
మున్సిపల్ ఎన్నికల అధీకృత అధికారి జే.కార్తీక్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికల్లో కీలక ఘట్టం అయిన ఛైర్పర్సన్ కార్యాచరణ ప్రారంభం అయింది. కౌన్సిలర్ లు ప్రమాణ స్వీకారం,అనంతరం ఛైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ ను పూర్తి చేస్తారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చే నియమించబడిన అధీకృత అధికారి,భూ పరిపాల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జే.కార్తీక్ ఆదివారం నవతెలంగాణ తో మాట్లాడారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఎన్నికకు ముందే ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్ లు చే ప్రమాణస్వీకారం చేయిస్తామన్నారు.అనంతరం చేతులు ఎత్తే పద్దతిలో చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తామని అందుకోసం సోమవారం 11 గంటలకు కౌన్సిలర్ చే ప్రమాణస్వీకారం చేయిస్తాం,12 .30 కు ఛైర్పర్సన్ ఎన్నిక కోసం ప్రత్యక్ష ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ముందుగా ఛైర్పర్సన్ ఎన్నిక కు నోటిఫికేషన్ విడుదల చేస్తాం.ఎన్నిక కాబడిన కౌన్సిలర్ల కోరం కు సరిపడిన సభ్యులు ఉన్నారా లేదా చూసి కోరం పూర్తి కాకపోతే పూర్తి అయ్యే వరకు చూస్తాం. కోరం పూర్తైన తర్వాత ఛైర్పర్సన్ అభ్యర్థి పోటీ లో ఉన్న వారిని ఆహ్వానిస్తాం.సంబందిత పార్టీ ఏ ఫాం జారీ చేసిన విప్ చే సూచించబడిన భీఫాం ఉన్న వ్యక్తులు ప్రతిపాదిత, బలపర్చిన వ్యక్తులతో సంతకాలు తీసుకుంటాం. చైర్మన్ పదవికి ఒకరికంటే ఎక్కువ పోటీ పడితే వరుస క్రమంలో పేర్లు నమోదు చేసుకుని అదే క్రమంలో ఆయా వ్యక్తులకు కౌన్సిలర్ లు చేతులెత్తిస్తాం.అందులో ఎవరికి ఎక్కువ మంది చేతులు ఎత్తితే వారినే చైర్మన్ గా నిర్ధారిస్తారు.ఒకరే ఉంటే అనానిమస్ గా గుర్తిస్తాం అని తెలిపారు.



