- Advertisement -
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన ఎలువాక రాజేశ్వరి (60) ఇటీవల అనారోగ్యం పాలై చికిత్స పొంది మృతి చెందగా… మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ మృతురాలు రాజేశ్వరి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి రాజేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు మైదం జయన్న, ఏలువాక బుచ్చయ్య, రొడ్డ శ్రీనివాస్, దామెర శ్రీనివాస్, ఎలువాక దిలీప్ తదితరులు ఉన్నారు.
- Advertisement -