- ఆహ్వానించిన ప్రతి వేడుకకు హాజరు
– నూతన వస్త్రాలు అందజేత - – మాజీ ఎమ్మెల్యే తాటి ప్రత్యేకత
- నవతెలంగాణ – అశ్వారావుపేట
- అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే,ట్రైకార్ మాజీ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో సుపరిచిత నాయకుడు. ఆర్థిక స్థితి, సామాజిక హోదా వంటి తారతమ్యాలను పట్టించుకోకుండా ఎవరు ఆహ్వానించినా వారి కుటుంబ వేడుకలకు హాజరవడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
ప్రస్తుతం ఉన్న లేదా మాజీ ప్రజాప్రతినిధులతో పోలిస్తే భిన్నంగా, వివాహాలు, పుట్టినరోజులు, బారసాల వంటి కుటుంబ కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించడమే కాకుండా, నూతన వస్త్రాలు బహూకరించడం తాటి వెంకటేశ్వర్లు నైజంగా మారింది.
ఇదే క్రమంలో అశ్వారావుపేట మండలం వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో తిరుమలకుంట గ్రామానికి చెందిన తన అభిమాని పానుగంటి వేణు – సాహిత్య దంపతుల కుమారుడు లక్ష్యశ్రీ సాత్విక్ తొలి పుట్టినరోజు వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తాటి వెంకటేశ్వర్లు చిన్నారిని దీవించి, నూతన వస్త్రాలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జుజ్జూరి వెంకన్నబాబు, ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, బొల్లుకొండ చెన్నారావు, పానుగంటి లక్ష్మణరావు, పానుగంటి చెన్నకేశవులు, సాయికుమార్, జుజ్జూరి ముత్యాలరావు, మడకం వెంకన్నబాబు, కోర్స ప్రతాప్, పొట్ట రాము, కొనకళ్ళు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



