- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ఆదర్శనగర్ లో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు పిల్లలు, పురుషులు ఒకరి ఒకరు రంగులు చల్లుకుంటూ హ్యాపీ హోలీ అంటూ వీధిలోని ఇంటింటికి వెళ్లి హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డిష్ ప్రకాష్ 25 వార్డు కౌన్సిలర్ భూపేందర్, ఉపాధ్యక్షులు గోపి.కార్యదర్శి అరుణ్, క్యాషియర్ బాలరాజు. సౌడ రవి , శ్రావణ్ శ్యామ్, రాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



