– జీఐ అనుసంధానంతో మార్కెటింగ్ పెంచాలి : భారత్ జీఐ మహోత్సవ్ ప్రారంభంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
– నకిలీలు నివారించాలి : శైలజా రామయ్యర్
– ఎమ్ఎస్ఎమ్ఈకి ప్రభుత్వాలు ప్రోత్సాహం : జే నితిన్ చక్రవర్తి
– కళాశాలల నుంచే పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి : ఏపీకే రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మరుగున పడుతున్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళాఖండాల సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకే జాతీయ భౌగోళిక సూచిక (జీఐ) ఏర్పడిందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దీనిలో సాధారణ ప్రజలు మొదలు పారిశ్రామికవేత్తలు, కళాకారులు, మహిళా స్వయం సహాయక బృందాలు కూడా భాగస్వాములుగా ఉన్నారని వివరించారు. వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదనీ, అందువల్ల జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేఎల్ యూనివర్సిటీ, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఎస్ఎమ్ఈ), కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ (ఎమ్ఎస్ఎమ్ఈ), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తా ధ్వర్యంలో మంగళవారంనాడిక్కడి సత్యసాయి నిగమాగమనంలో భారత్ జీఐ మహోత్సవాలను బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. 16 రాష్ట్రాలకు చెందిన జీఐ గుర్తింపు ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఐ అనేది ఆయా ప్రాంత ప్రజల ఆత్మగౌర వానికి ప్రతీకలు అనీ, పోచంపల్లి ఇక్కత్ చీరలు, కాంచీపురం, మైసూర్ చందనం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇవి దేశప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నాయనీ, ఆత్మనిర్భర్ భారత్కు జీఐ ఉత్పత్తులు బలమైన ఆధారమని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లోని జీఐ ఉత్పత్తులను కూడా ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు పంపే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయనీ, ఆ సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కొత్త మార్కెట్ను సృష్టించుకోవాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి భద్రతలో ఎమ్ఎస్ఎమ్ఈ రంగం దేశానికి వెన్నెముక అనీ, కేంద్ర ప్రభుత్వం ఆ రంగానికి రూ.10వేల కోట్ల నిధుల్ని కేటాయించిందనీ, దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు. నేటితరం యువత సంప్రదాయ కళారంగంలోకి ప్రవేశించాలనీ, ఆయా ఉత్ప త్తులకు దేశీయ, అంతర్జాతీయ ప్రచారం కల్పించాలని చెప్పారు. దానికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్విని యోగం చేసుకో వాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్, హ్యాండీ క్రాఫ్ట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ జీఐ గుర్తింపు అనేది పేటెంట్ వంటిదేనని స్పష్టం చేశారు. జీఐ రిజిస్ట్రేషన్లు క్రమంగా పెరుగుతున్నాయనీ, దానికి అవసరమైన మార్కెటింగ్పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయని తెలిపారు. జీఐ గుర్తింపు కళాకృతు లకు సంబం ధించి నకిలీల బెడద తీవ్రంగా ఉందనీ, దాన్ని నివారించేందుకు ఎన్ఫోర్స్ మెంట్ పనిచేస్తున్నదని చెప్పారు. అయినప్పటికీ అసలు, నకిలీ మధ్య తేడాను ప్రజలకు వివరించగలిగితే జీఐ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగు తుందని అభిప్రాయపడ్డారు. జీఐ ఉత్పత్తుల డాక్యుమెంటేషన్ జరగాలనీ, మార్కెటింగ్ను ప్రోత్సహించేందుకు పారిశ్రామికసంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చినా, జీఐ గుర్తింపును నిలుపుకోగలగడమే అసలైన సవాలుగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎమ్ఎస్ఎమ్ఈ రంగంలోనే 65శాతం ఉపాధి అవకాశాలు ఉన్నాయనీ, దాన్ని ప్రోత్సహించేందుకే ప్రభుత్వాలు ఎగ్జిబిషన్లు సహా ఇతర మార్గాల్లో మార్కెటింగ్ అవకాశాలు సృష్టిస్తున్నాయని తెలిపారు. జీఐ ఉత్పత్తుల అప్గ్రేడ్తో పాటు ఉద్యోగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ఎఫ్ఎస్ఎమ్ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు విద్యాసంస్థల నుంచే తయారవ్వాలనీ, ఇంజినీరింగ్ విద్యావిధానంలో ఆ తరహా మార్పులు చేయాలని సూచించారు. విద్యార్థులను కేవలం ఉద్యోగులుగా కాకుండా, ఉద్యోగ సృషి ్టకర్తలుగా మార్చా లనీ, పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై వారికి విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) ప్రమాణాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయనీ, ప్రభుత్వ సహకారంతో వాటిని అధిగమించాలని చెప్పారు. కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ కే పరశురామయ్య, కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధి రాఘవరావు, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండిస్టీస్ అసోసి యేషన్ అధ్య క్షులు ఎం రాజమహేందర్రెడ్డి, జీఐ నిపుణులు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వ ఉత్పత్తులను ప్రోత్సహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



