భారత్, ఆస్ట్రేలియా ఏకైక టెస్టు
పెర్త్ (ఆస్ట్రేలియా) : ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు తడబాటుకు గురవుతోంది. తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకే కుప్పకూలిన హర్మన్ప్రీత్ సేన.. రెండో ఇన్నింగ్స్లో 105/6తో కష్టాల్లో కూరుకుంది. స్మృతీ మంధాన (2), షెఫాలీ వర్మ (5), జెమీమా రొడ్రిగ్స్ (14), హర్మన్ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (0) దారుణంగా విఫలమయ్యారు. ప్రతికా రావల్ (43 నాటౌట్, 84 బంతుల్లో 6 ఫోర్లు), స్నేV్ా రానా (14 నాటౌట్, 17 బంతుల్లో 1 ఫోర్) అజేయంగా ఆడుతున్నారు. 29 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత్ 105 పరుగులే చేసింది. ఆసీస్ బౌలర్లలో లూసీ హామిల్టన్ (3/32), అనాబెల్ సుథర్లాండ్ (2/15) రాణించారు. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 90.4 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. అనాబెల్ సుథర్లాండ్ (129, 171 బంతుల్లో 17 ఫోర్లు) సెంచరీతో మెరువగా, ఎలిసీ పెర్రీ (76, 116 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీ సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 125 పరుగుల ఆధిక్యం దక్కించుకోగా.. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ మరో 20 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
అమ్మాయిల తడబాటు
- Advertisement -
- Advertisement -



