నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర, శ్రీ భాష్యం , మదర్ థెరిస్సా హైస్కూల్ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండలోని శ్రీ వెంకటేశ్వర, మదర్ థెరిసా హైస్కూల్ కు చెందిన మహిళ ఉపాధ్యాయులను పాఠశాల కరస్పాండెంట్ కే రామలక్ష్మి రెడ్డి శాలువలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భాష్యం పాఠశాల కరస్పాండెంట్ రత్నాకర్ మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మహిళలు ఇంటి పనులను చక్కబెడుతూనే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటున్నారని మహిళా ఉపాధ్యాయుల పాత్ర సమాజంలో ఎంతో ఉంటుందని వారు కొనియాడారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



