మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీలేఖ
నవతెలంగాణ – బీర్కూర్ నసురుల్లాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత వైద్య శిబిరంకు అన్నయ్య స్పందన కలిగిందని డాక్టర్ శ్రీలేఖ తెలిపారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరముకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భారీ ఎత్తున రోగులు తరలివచ్చారు. ఈ ప్రత్యేక శిబిరంలో 29 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది రోగులను సమస్యలను గుర్తించి కామారెడ్డి నిజామాబాద్ ఆసుపత్రులకు రిఫరల్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పట్ల ప్రత్యేక చురువతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. టీ డయాగ్నస్టిక్స్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన శిబిరంలో మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్, కంటి, ఎముకలు, దంత వైద్య నిపుణులు వచ్చి రోగులకు పరీక్షలు చేయడం జరిగిందన్నారు. సమస్యలను గుర్తించి
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో వృద్ధాప్య చికిత్స శిబిరాలు, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు కంటి పరీక్షలు, పోషక ఆహారంపై అవగాహన, వ్యాధి నిరోధక టీకాల పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ శుభ్రంకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీర్కూరు మండల కేంద్రంలో ఉచిత వైద్యానికి శుభ్ర నిర్వహించడం ఎంతో అభినంది ఏమో అని గ్రామ సర్పంచ్ ధర్మతేజ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమాదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ రమ్య డాక్టర్ అఖిల్, డాక్టర్ శబరిస్, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



