- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్టీసీలో మళ్లీ సమ్మె సైరన్ మోగనుంది. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్ భవన్కు పోలీసులు, కార్మిక సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు. నోటీసు ఇచ్చిన తర్వాత సమ్మె వివరాలు తెలిసే అవకాశం ఉంది.
- Advertisement -



