- Advertisement -
ఆహ్వానం అందుకున్న ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కేంద్రంలో ఈ నెల 16,17,18 మూడు రోజులపాటు ప్రభుత్వ పథకాలపై (వర్క్ షాప్) సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్జీవోల పాత్ర ఉన్నందున యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ క్యాoపియన్ తెలంగాణ ద్వారా ఆర్టీఐ కాటారం డివిజన్ ఇంఛార్జి, భూపాలపల్లి జిల్లా కోకన్విర్ చింతల కుమార్ యాదవ్ ఆహ్వానం అందుకున్నారు. మూడు రోజులపాటు నిర్వహించే సెమినార్ కు ఎంపికైనట్లుగా రాష్ట్ర ఆర్గనైజర్ యం. వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్ షాప్ ప్యాకల్టీలచే నిర్వహించునట్లుగా తెలిపారు.
- Advertisement -



