ఆలేరు గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని ఆలేరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించినట్లు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి మణిదీప్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు,గ్రామస్తులతో కలిసి గ్రామ అభివృద్ధి పై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభలో వచ్చినటువంటి ప్రధానమైన సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరగా ఆ సమస్యలు అయినటువంటి కోతుల సమస్య, బొడ్రాయి,ధ్వజ స్తంభం ప్రతిష్ట, విద్యుత్ లైన్&స్తంబాలు, సైడ్ డ్రైనేజీ, త్రాగు నీరు, వంటి పలు సమస్యలు చర్చకు రావడం జరిగింది అని అన్నారు.
వాటిని ప్రజలందరి సహకారంతో సమస్యను తీర్చుకుందాం అని అన్నారు. అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలు పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మణిదీప్,ఉప సర్పంచ్ గన్న హరీష్, వార్డు సభ్యులు పోతరాజు నరేష్, డోనికేని భాగ్యలక్ష్మి, ఎంకె వీరన్న, కాంపటి భవాని, ఏడెల్లి వెంకటమల్లు, చాగంటి మల్లేష్,వేణుగోపాల స్వామి ఆలయ ఛైర్మెన్ ఏరె కృష్ణ, శివాలయం చైర్మన్ భూపతి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, ఏ ఈ ఓ మణికంఠ, లైన్ మెన్ రమేష్, పశువు వైద్యాధికారి డాక్టర్ రాజేష్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.



