- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రొఫెసర్ జయశంకర్ సాధన కోసం మనమంతా పునరంకితమవుదామని మద్నూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ.. ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకల్లో ఎంపీడీవో కార్యాలయ అధికారులు సిబ్బంది, మండలంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


