- Advertisement -
మంత్రి దనసరి అనసూయ సీతక్క
11 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, ప్రగతిశీల భావాలతో ముందుకు సాగుతున్న ప్రముఖ దినపత్రిక ‘నవతెలంగాణ’ 11వ వార్షికోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని, పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి, పాఠకులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలోనూ, ప్రజల పక్షాన నిలవడంలోనూ నవతెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజూ ప్రజల అభిమానాన్ని పొందుతూ, సత్యం వైపు నిలబడే జర్నలిజానికి ప్రతీకగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా.
- Advertisement -



