- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని అంతంపల్లి, సిద్ధ రామేశ్వర నగర్, రామేశ్వర్ పల్లి, భిక్కనూర్ గ్రామాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు-సీతమ్మల కల్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మంజుల సంజీవరెడ్డి, రాణీ శ్రీనివాస్, రేఖా సుదర్శన్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తులు భజనలు, మంగళహారతులతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
- Advertisement -



