నవతెలంగాణ విశాఖపట్నం: డియాజియో ఇండియా (యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్), భారత్కేర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖలతో కలిసి తమ ‘రాంగ్ సైడ్ ఆఫ్ ది రోడ్’ (WSOTR) కార్యక్రమం కింద విశాఖపట్నంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్ టి ఓ) వద్ద ఒక కొత్త డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్ను ప్రారంభించింది. రహదారి భద్రత, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించాలనే డియాజియో ఇండియా లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలువనుంది. ఈ ప్రారంభంతో, ఆంధ్రప్రదేశ్లోని 4 ఆర్టిఓలలో WSOTR ట్యాబ్-ల్యాబ్ కేంద్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
డియాజియో ఇండియా ‘స్పిరిట్ ఆఫ్ ప్రోగ్రెస్’ ఈఎస్జి కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా, ‘రాంగ్ సైడ్ ఆఫ్ ది రోడ్’ (WSOTR) అనేది మద్యం సేవించి వాహనం నడపడాన్ని నివారించటానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించుకునే ఒక విద్యా ఆధారిత, ప్రవర్తనా మార్పును లక్ష్యంగా చేసుకున్న ఒక కార్యక్రమం. లీనమయ్యే, సాంకేతికత ఆధారిత మాడ్యూళ్ల ద్వారా అందించబడే WSOTR, సురక్షితం కాని డ్రైవింగ్ పరిణామాలను తెలియజేయడానికి నిజ జీవిత పరిస్థితుల అనుకరణలతో డ్రైవర్లను నిమగ్నం చేస్తుంది. ట్యాబ్ ల్యాబ్స్ వద్ద, కొత్త డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులందరికీ తప్పనిసరి అయిన 45 నిమిషాల మాడ్యూల్లో, సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించడానికి రూపొందించిన ఇంటరాక్టివ్ వీడియో కంటెంట్, ప్రవర్తనా మదింపులు ఉంటాయి. నిజ జీవిత పరిస్థితులను అనుకరించడం ద్వారా, ఈ కార్యక్రమం భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది, డ్రైవర్ ప్రవర్తన,రహదారి భద్రతపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. విశాఖపట్నంలోని కొత్త ట్యాబ్ ల్యాబ్, దేశవ్యాప్తంగా రహదారి భద్రత పట్ల నిబద్ధతను బలోపేతం చేస్తూ, విస్తరిస్తోన్న 83 ల్యాబ్ల నెట్వర్క్లో ఒక భాగం.
విశాఖపట్నంలో రహదారి భద్రతను మెరుగుపరచడానికి బాధ్యతాయుతమైన, అవగాహనతో కూడిన డ్రైవింగ్ను ప్రోత్సహించడమే తమ ప్రాథమిక లక్ష్యమని గౌరవనీయ ప్రాంతీయ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. విశాఖపట్నం ఆర్టిఓ వద్ద ఏర్పాటు చేసిన “డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్”,ఒక వినూత్నమైన, సాంకేతికత ఆధారిత విధానం ద్వారా డ్రైవర్లకు శిక్షణ అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వాస్తవ రహదారి పరిస్థితులు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన పెంచడానికి సహాయపడుతుంది. ప్రారంభ దశ నుంచే బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనను పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో డియాజియో ఇండియా, భారత్కేర్స్ సంస్థల సహకారాన్ని ఆయన అభినందించారు.
డియాజియో ఇండియా కార్పొరేట్ రిలేషన్స్ హెడ్ దేవాశిష్ దాస్గుప్తా మాట్లాడుతూ, “మా ‘స్పిరిట్ ఆఫ్ ప్రోగ్రెస్’ ఈఎస్జి ఎజెండాలో భాగంగా, బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. అనేక అవగాహన కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టాము. భారత్కేర్స్తో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన జ్ఞానం , అవగాహనతో డ్రైవర్లను శక్తివంతం చేయడానికి మేము మా WSOTR కార్యక్రమాన్ని విస్తరిస్తున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి వైఖరులలో అర్థవంతమైన మార్పు తీసుకురావడం అత్యవసరం. రాష్ట్రంలోని నాలుగు ఆర్టిఓలలో ట్యాబ్ ల్యాబ్లను ఏర్పాటు చేసినందుకు మేము గర్వపడుతున్నాము” అని అన్నారు.
భారత్కేర్స్ ప్రతినిధి బసంత్ సాహు మాట్లాడుతూ, “సురక్షితమైన రహదారులు, బాధ్యతాయుతమైన ప్రవర్తన అనే ఉమ్మడి లక్ష్యంను ముందుకు తీసుకెళ్లడంలో డియాజియో ఇండియా, సాంకేతికత, లక్షిత విద్య సమిష్టిగా పనిచేసి అర్థవంతమైన సామాజిక ప్రభావాన్ని సృష్టించగలవో ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుంది. ట్యాబ్ ల్యాబ్ వంటి కార్యక్రమాల ద్వారా, మేము వ్యక్తులు సరైన అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా చేస్తూనే వివిధ సమాజాలలో భద్రత, బాధ్యతలకు సంబంధించిన విస్తృత సంస్కృతికి కూడా తోడ్పడుతున్నాము..” అని అన్నారు.



