Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅన్యాయాన్ని ఎదిరించిన మోటూరు ఉదయం

అన్యాయాన్ని ఎదిరించిన మోటూరు ఉదయం

- Advertisement -

కెఎన్‌ ఆశాలత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మోటూరు ఉదయం ప్రత్యక్షం అయ్యేవారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ఎన్‌.ఆశాలత గుర్తుచేశారు. ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని ఐలమ్మ భవనంలో ఉదయం వర్థంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆశాలత మాట్లాడుతూ గుంటూరు జిల్లాలోని కమ్మవారిపాలంలో 1924 అక్టోబర్‌ 13న రైతు కుటుంబంలో జన్మించిన ఉదయం ఉద్యమంలో బుర్రకథా దళానికి ఆయుధంలాగా పని చేశారని తెలిపారు. ఎక్కిడికైనా సరే సైకిల్‌పై పర్యటించే ఆమె 1980లో మహిళా ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక అంశాలప్తెన ఆందోళనలు నిర్వహించారని తెలిపారు. ఆమె పిల్లలు ఉష, టాన్యా ఉదయకు ఉద్యమాల్లో చురుకుగా సహకరిస్తూ పని చేశారన్నారు. 2002 మర్చి 31న తన కుమార్తె ఉష ఇంట్లో ఉదయం తుదిశ్వాస విడిచేంత వరకు ఉద్యమంలో ఉన్నారన్నారు.మోటూరు, ఉదయం, అల్లూరి మన్మొహిని, మల్లు స్వరాజ్యం, కోటేశ్వరమ్మ, ఎం పార్వతిల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవడమే ఉదయంకు ఇచ్చే ఘనమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవిత, కరాటే మాస్టర్‌ సుబ్రహ్మణ్యం, కరాటే శిక్షణ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -