– పది మందిపై కేసు నమోదు
– ఏడుగురి అరెస్టు.. రిమాండ్కు తరలింపు : ఖమ్మం సీపీ సునీల్ దత్
నవతెలంగాణ-కల్లూరు
విధి నిర్వహణలో ఉన్న కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ శనివారం తెలిపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావుతోపాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం కల్లూరు పట్టణం ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులోని చౌదరి హౌటల్ వద్దకు వచ్చి తమకు పరోట కావాలని అడిగారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారు. ఇంకా తయారు కాలేదని, ఇంకో గంట సమయం పడుతుందని చెప్పడంతో హౌటల్ సిబ్బందిపై వారు దాడికి దిగారు. విషయాన్ని హౌటల్ యజమాని మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్లకు సమాచారం అందించారు. కానిస్టేబుళ్లు వచ్చి గొడవ చేస్తున్నవారికి సర్దిచెప్పి పంపించారు. అనంతరం హౌటల్ యజమాని స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే, రామారావు మళ్లీ మద్యం తాగి.. తల్లాడ మండలం నుంచి మరికొంత మందిని వెంట బెట్టుకుని 7 గంటల సమయంలో హౌటల్కు వచ్చాడు. పరోటా పెట్టాలంటూ గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న హౌటల్ యజమాని పోలీస్ స్టేషన్ నుంచి వెంటనే హౌటల్ దగ్గరకు వచ్చారు. అప్పటికే వారు తాగిన మైకంలో గొడవ చేస్తుండటంతో ఈ విషయాన్ని ఎస్ఐ హరిత దృష్టికి తీసుకుపోయారు. ఆమె వెంటనే సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ఎందుకు గొడవ చేస్తున్నారని అడిగారు. ఇంతకు ముందే కానిస్టేబుల్స్ సర్ది చెప్పినా ఎందుకు వెళ్లిపోలేదు.. మరో హౌటల్లో తినొచ్చుగా అని అడిగారు. ఈ క్రమంలో రాయల రామారావు, అతని అనుచరులు అసభ్యంగా మాట్లాడుతూ మహిళా ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఎస్ఐ హరిత రామారావుపై చెంప మీద కొట్టడంతో కోపోద్రిక్తుడైన రామారావు ఎస్ఐని నెట్టేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హౌటల్ యజమాని, కల్లూరు ఎస్ఐ ఫిర్యాదు మేరకు రామారావు, అతని అనుచరులపై వేరు వేరుగా కేసులు నమోదు చేశారు. మొత్తం పదిమందిపై కేసులు నమోదు కాగా ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో రాయల రామారావుపై తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది.
మహిళా ఎస్ఐపై దురుసు ప్రవర్తన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES