గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబోలో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ తొలి ప్రొడక్షన్ వెంచర్ను ఆయన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కోసం చిత్రాలయం స్టూడియోస్తో కలిసి పని చేస్తుంది. టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా చేరారు.ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, ”పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. విశ్వప్రసాద్కి ధన్యవాదాలు. సినిమా చాలా అద్భుతంగా వస్తోంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఈ సినిమాకి ఒక యూనిక్ పాయింట్ ఉంది.