Tuesday, June 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహించాలి

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహించాలి

- Advertisement -

జులై 1న బల్కంపేట శ్రీఎల్లమ్మ కల్యాణోత్సవం : హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవతెలంగాణ- సిటీబ్యూరో

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలను, బల్కంపేట కల్యాణోత్సవం, రథోత్సవం వైభవోపేతంగా జరపాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై పోలీస్‌, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎండోమెంట్‌ వివిధ శాఖల అధికారులతో శాఖల వారీగా బల్కంపేట శ్రీఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జులై 1న శ్రీఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం తదితర కార్యక్రమాలపై అధికారులు అప్రమత్తంగా ఉండి జనానికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గర్భిణీ, చిన్నపిల్లలు, మహిళ లకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గత సంవత్సరం బారికేడ్లు, లైన్‌లలో ఇబ్బందులు తలెత్తాయని, ఈసారి అలాంటి తప్పులు జరగకుండా సీసీ కెమెరాలతో నిరంతర భద్రత పర్యవేక్షణ చేయాలన్నారు. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శానిటేషన్‌ కోసం అదనంగా ప్రత్యేక సిబ్బందిని, మొబైల్‌ టాయిలెట్స్‌, మెయిన్‌ రోడ్డుపై లైటింగ్‌ డెకరేట్‌, పెద్ద లైట్స్‌ ఏర్పాటు చేయాలని, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉచిత ఫ్యూరిఫైడ్‌ మంచినీటి సరఫరా, అదనంగా వాటర్‌ ట్యాంకర్ల ఏర్పాటు, హెల్త్‌ క్యాంప్‌లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిరంతర లైవ్‌ సరఫరా, పబ్లిక్‌ అనౌన్సమెంట్‌, స్క్రీన్‌లు ఏర్పాటు చేయాల న్నారు. పోలీస్‌, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అమ్మవారి కల్యాణ మహౌత్సవాలను విజయ వంతం చేయాలన్నారు. సమాచార శాఖ, పోలీస్‌, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, దేవాదాయ శాఖ అధి కారులు కంట్రోల్‌ రూమ్‌ నుంచి మానిటరింగ్‌ చేయాలని తెలిపారు. గత సంవత్సరం గుడి లోపల అభిషేకం సమయంలో సందర్శకులను ఆపడం వల్ల కొంత తోపులాట జరిగిందని, ఈసారి అలాంటి పరిస్థితి రావద్దు.. జనాన్ని అనుమ తివ్వాల న్నారు. డీజే సౌండ్‌ ఇబ్బం దులు లేకుండా పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుందని, ఇబ్బందులు లేనంత వరకు సౌండ్‌ పెట్టుకొని ఆట పాట నృత్యం చేసుకోవాలన్నారు. ఈ సమా వేశంలో ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, అడిషనల్‌ సీపీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌, జిల్లా కలెక్టర్‌ హరి చందన దాసరి, దేవాదాయ శాఖ కమిషనర్‌ వెంకట్‌రావు, కార్పొరేటర్‌ సరళ, పోలీస్‌, రెవిన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎండోమెంట్‌, ఎలక్ట్రిసిటీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -