నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శ్రీచైతన్య విద్యాసంస్థల ఐరావత్ చాంపియన్స్ వేడుక మంగళవారం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథులుగా ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, సినీనటుడు అడివి శేష్ హాజరయ్యారు. గౌరవ అతిథులుగా శ్రీచైతన్య డైరెక్టర్లు శ్రీధర్ యలమంచిలి, సుష్మా బొప్పన, సీమ బొప్పన పాల్గొన్నారు. గుకేశ్ ప్రస్తుతం శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ జేఈఈ, నీట్-2025 ఫలితాల్లో మరోసారి ఆలిండియా నెంబర్వన్గా శ్రీచైతన్య విద్యాసంస్థ నిలిచింది. ఈ సందర్భంగా ఐరావత్ చాంపియన్స్ వేడుకను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య విద్యార్థులు, ర్యాంకర్లు, అధ్యాపకులు హాజరయ్యారు. ర్యాంకర్లను సన్మానించారు. ఈ సందర్భంగా గుకేశ్ మాట్లాడుతూ చదరంగం మాదిరిగానే జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల విజయానికి వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, మానసిక స్థైర్యం ఎంతో అవసరమని అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ ఈ విజయాల వెనుక ఉన్న ప్రణాళిక, అంకితభావం అభినందనీయమని చెప్పారు. ఇంజినీరింగ్, మెడికల్ రంగాల్లో దేశవ్యాప్తంగా ప్రతిభావంతులను అందిస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు, మార్గదర్శక శక్తిగా నిలుస్తున్నాయని అన్నారు.
ఘనంగా శ్రీచైతన్య ఐరావత్ చాంపియన్స్ వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES