ఒకటవ పోలీస్ స్టేషన్లో అదృశ్య కేసు నమోదు..

నవతెలంగాణ కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అదృశ్య కేసును నమోదు చేసినట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు శనివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..మాలపల్లి ఏరియా నిజాంబాద్ పట్టణం కు చెందిన  షేక్ సుమేర్ వయస్సు 23 సంలు, పండ్ల వ్యాపారము చేసేవాడు రోజులాగే అనగా తేదీ 26-05-2023 ఉదయం 10 నుండి యధావిధిగా ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి రాలేదు సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నది. కావున అనుమానంతో తప్పిపోయినాడు అని  సుమీర్ తల్లి  దరఖాస్తు మేరకు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు.తప్పిపోయిన వ్యక్తి ఎరుపు రంగు కోలముఖము ఎత్తు సుమారు 5 ఫీట్ల 7 ఇంచులు ఎక్కువగా టీషర్ట్ పాయింట్స్ ధరించాడని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా గుర్తిస్తే ఒకటవ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
Spread the love