సానిటరీ నాప్ కిన్స్ యంత్రాన్ని ప్రారంభించిన కలెక్టర్..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో బుధవారం సానిటరీ నాప్కిన్స్ యంత్రాన్ని  కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఈ మిషన్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ఇలాంటి సౌకర్యాలను వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలన్నారు.  సిఏ లు స్రవంతి, రజిని, సుమలత, భాగస్వామ్యంలో ఈ యంత్రాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తాహసిల్దార్ అల్లం రాజకుమార్, సిసి సుభాషిని కెనరా బ్యాంక్ మేనేజర్ పూర్ణచందర్ చల్వాయి సర్పంచి ఈసం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love