ఖమ్మం జిల్లాలో విషాదం.. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి

నవతెలంగాణ – ఖమ్మం: ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మిగ్ జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ ఇంటి పైకప్పు కుప్పకూలడంతో పుల్లారావు(45), లక్ష్మీ(43) దంపతులు మృతి చెందారు. దీంతో వారి కుటంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

Spread the love