లక్నో, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైట్

నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.  అయితే ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు మాత్రమే ప్లే ఆఫ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఓడిన జట్టు మళ్లీ కష్టపడాల్సి వస్తుంది. ఇక లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Spread the love