నవతెలంగాణ-వేములపల్లి
మండల కేంద్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలకు శుక్రవారం అందజేశారు. మండల కేంద్రంలోని నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేయడంతో స్పందించిన మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్ష్య, కార్యదర్శులు పోతురాజు నాగయ్య, పరిశనబోయిన సైదులు, ఆంజనేయులు, హరి, రేగూరి రాము, నరేష్, రమేష్ ,వై సైదులు, కిరణ్, నాగరాజు, రమేష్, పుట్టల నాగయ్య, డీ. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.