నవతెలంగాణ-నకిరేకల్
మండలంలోని పాలెం గ్రామంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కేశవరావు 10 లక్షల నిధులతో గ్రంథాలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య, సర్పంచ్ ఏకుల కవిత విజరు కుమార్, ఉప సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ తాటిపాముల లింగయ్య, బొబ్బలి యాదగిరి, స్థానికులు ప్రద్యుమ్నాచారి, తాటిచెట్టు శ్రీనివాస్, చేగోని యాదగిరి, నోముల కేశవరాజు, బొంకూరి బిక్షం, ట్రస్ట్ సభ్యులు నోముల మనోహర్, మాజీ ఎంపీటీసీలు మాచర్ల స్వామి, నాగిళ్ల వెంకటయ్య పాల్గొన్నారు.