గొల్ల కురుమలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి…

– గాంధీభవన్ ముట్టడిస్తాం
– జడ్పిటిసి సుబ్బురు భీరు మల్లయ్య
నవతెలంగాణ – భువనగిరి రూరల్
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గొల్ల కురుమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రోజు నిర్వహించే మహాధర్నాలను జయప్రదం చేయాలని భువనగిరి జడ్పిటిసి సూబ్బురు బీరు మల్లయ్య , యాదవ్ సంఘము జిల్లా అధ్యక్షులు అయోధ్య యాదవ్ లు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ( ప్రెస్ మీట్) నిర్వహించి, మాట్లాడారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు రైతు బజార్ దగ్గర నిర్వహించే మహాధర్నాకు గొల్ల కురుమలు ఎక్కువ సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, చందుపట్ల సర్పంచ్ చిన్నం పాండు, ఎంపీటీసీ ఉడత శారద ఆంజనేయులు యాదవ్, నాయకులు నక్కల చిరంజీవి యాదవ్, గుండెబోయిన సురేష్ యాదవ్, కొత్తపల్లి ఆనంద్ యాదవ్, భాత్క అశోక్ యాదవ్ లు పాల్గొన్నారు.

Spread the love