తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

నవతెలంగాణ- హైదరాబాద్‌: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో 285 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లో  మూడు ఈవీఎంలు, 9 స్థానాల్లో రెండు ఈవీఎంలు వాడనున్నారు.  శుక్రవారం నుంచి హోం ఓటింగ్‌ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో 3,986 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు.

Spread the love