గంభీర్ పూర్ లో జోరుగా దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర

నవతెలంగాణ-దుబ్బాక రూరల్
దుబ్బాక మండల పరిధిలోని గంభీర్ పూర్ గ్రామంలో కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన “దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర”లో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందింది ఏం లేదన్నారు.బడుగు, బలహీనవర్గాల ప్రజలు దోపిడికి గురవుతున్నారని విమర్శించారు. ఇటీవల మరణించిన మీరాపురం రాజవ్వ కుటుంబ సభ్యులకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ నరేందర్,భాస మధు,కొంగర రవి,గడిల గోపాల్ రెడ్డి, అమర్, విజయ్ గోపాల్ రెడ్డి, ఇస్తారిగల్ల మల్లేశం, దుబ్బారెడ్డి, మిద్దె రాజయ్య, రాజులు, దుర్గయ్య, తోట్ల చంద్రం పలువురున్నారు.

Spread the love