కాంగ్రెస్ కు షాక్.. నేను బీఆర్ఎస్ లోనే ఉంటా..

నవతెలంగాణ – హైదరాబాద్: 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరుఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా ప్రకాష్ గౌడ్ రెండో సారి గెలిచారు. అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ కావడంతో పార్టీ మార్పుపై వార్తలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి అందరి లాంటి వారు కాదని పొగడ్తలతో ముంచెత్తడంతో మంత్రి పదవి కోసం ప్రకాష్ గౌడ్ పార్టీ మారేందుకు సిద్ధం అయినట్లు జోరుగా చర్చ జరిగింది. ఈ వార్తలపై స్పందించిన ఆయన.. ఈరోజు ఉదయం తన కేడర్‌తో సమావేశమయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని.. కాంగ్రెస్ పార్టీలో చేరబోనని కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు. అయితే పార్టీ మార్పుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని.. ఎమ్మెల్యే తన నిర్ణయం మార్చుకోవాలని ముఖ్య నేతలు ఆయనకు సూచించడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తుంది.

Spread the love