భక్తులకు ప్రత్యేక ఆహ్వానం సాయంత్రం 6 గంటలకు తిరుపతి జెండా

నవతెలంగాణ- మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి ఈ రోజు తిరుమల తిరుపతి బాలాజీ జెండా మహారాష్ట్రలోని దేగ్లూర్ పట్టణం నుండి ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిరుమల తిరుపతి బాలాజీ మద్నూరుకు చేరుకోనుంది ఈ జెండా ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు జెండా ఉత్సవ సమితి సభ్యులు భక్తులను కోరారు . భక్తులు, గ్రామస్థులు అందరూ తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి జెండాకు ఈ రోజు సాయంత్రం పాత బస్టాండ్ వద్దకు విచ్చేసి స్వామి వారిని ఆహ్వానించి, దర్శించుకుని గాంధీ చౌక్ లో జెండా స్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని శ్రీ బాలాజీ జెండా ఉత్సవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Spread the love