ఆర్మీ సైనికులకు సన్మానం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి : మండల కేంద్రమైన కమ్మర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ సైనికులను స్థానిక అయ్యప్ప స్వాముల బృందం సభ్యులు సన్మానించారు. శాసనసభ ఎన్నికల్లో భాగంగా గత కొద్దిరోజులుగా  63వ నంబర్ జాతీయ రహదారి పై స్థానిక జంబి హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లాల చెక్ పోస్ట్ వద్ద ఆర్మీ జవాన్లు విధులు నిర్వహిస్తున్నారు. వారిని స్థానిక అయ్యప్ప స్వాముల బృందం సభ్యులు ఆహ్వానించి శాలువాలతో   సన్మానించారు. దేశం కోసం ఆర్మీ జవాన్లు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో గురు స్వామి  సామ కిషన్ (కపిల్), పలహారం యాదగిరి, అయ్యప్ప స్వాములు సంజీవ్, నరసయ్య, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love