ఒంటిపై కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

కడుపునొప్పి భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన వడ్డేపల్లి శ్రీజ (23) మృతి చెందింది. ఇంట్లో ఉన్న శ్రీజ కడుపునొప్పి తీవ్రం కావడంతో ఉదయం ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ శ్రీజ పరిస్థితి విషమించి ఇంటి వద్ద మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శ్రీజ కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నట్లు మేనమామ శ్రీనివాస్  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
Spread the love