నవతెలంగాణ-కొడంగల్
పాత భూకక్షలు, అక్రమ సంబంధం అనుమా నంతోనే సంగేపల్లి శేఖర్ హత్యకు గురయ్యాడని సీఐ శంకర్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని 3 రోజుల క్రితం జరిగిన హత్యను పోలీసులు ఛేదించా రు. సంగెపల్లి దత్తు, సంగేపల్లి శేఖర్లు ఒకే కుటుం బానికి చెందిన ఇద్దరు 2021 సంవత్సరంలో సంగె పల్లి దత్తు అన్న వెంకటప్ప రోడ్డు ప్రమాదంలో కింద పడి చనిపోవడంతో సంగేపల్లి శేఖర్, దత్తు అన్న వెం కటప్పను చంపేశాడనే అనుమానంతో కక్ష పెంచు కుని శేఖర్ను మట్టుపెట్టాలని ఎన్నో రోజులుగా ఎదు రుచూస్తున్నారు. సంగేపల్లి శేఖర్ హైదరాబాద్లో కోళ్ల ఫారంలో పనిచేస్తూ అక్కడే ఉండే వారన్నారు. అనేకమార్లు దత్తు తన స్నేహితులైన భీమేష్, నరేష్ లకు అనేకమార్లు చెప్పి బాధపడే వారన్నారు. శేఖర్ను దత్తు చేతులారా చంపాలని హత్యకు రెండు రోజుల ముందు తన ఇంటి వద్ద చంపాలని నిర్ణయించుకుని వీలు కాకపోవడంతో బొక్క గోపాల్కి సహకరించా లని దత్తు చెప్పడంతో తన భార్యతో అక్రమ సంబం ధం పెట్టుకున్న శేఖర్ను ఇదే అదునుగా భావించిన బొక్క గోపాల్ బయటకు తీసుకువచ్చేందుకు నిర్ణ యించుకున్నారు. నిర్ణయం ప్రకారమే బొక్క గోపాల్, శేఖర్ మందు తాగుదామని గుండాల రోడ్లో నిర్మానుశ ప్రదేశానికి వెళ్తుండగా దత్తుకు ఫోన్ ద్వారా సమా చారం అందించారు. దత్తు తన స్నేహితులైన భీమేష్, నరేష్ లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి ముగ్గురు కలిసి శేఖర్, గోపాల్ ఉన్న చోటికి వెళ్లారు, నలుగురు కలిసి మద్యం తాగుతూ దత్తు, గోపాల్, భీమేష్, నరేష్ లు అనుకున్న ప్రకారమే బీరు సీసాలతో శేఖర్పై ము క్కుమ్మడిగా దాడి చేసి బండరాయితో తలపై కొట్టడం తో తీవ్ర గాయాలయై అక్కడికక్కడే మరణించాడు, శేఖర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకు న్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా నిధులను పట్టుకొని కోర్టు ముందు హాజరు పరిచి నిందితులను జైలుకు పంపించినట్లు సిఐ శంకర్ తెలిపారు.