బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటి హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం ఆమె విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారని పేర్కొన్నారు. అయితే ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు విడుదలయ్యారు.

Spread the love