కూలీలకు రూ 272 కూలీ అందేలా పని చేయించాలి: అడిషనల్ డి ఆర్ డి ఓ వామన్ రావు

నవ తెలంగాణ- రామారెడ్డి
ఉపాధి హామీ కూలీలు రూ 272 రోజువారి కూలీ అందేలా, కొలతలతో పని చేయించాలని ఉపాధి హామీ సిబ్బందికి గురువారం అడిషనల్ డి ఆర్ డి ఓ వామన్ రావు సూచించారు. మండలంలోని కన్నాపూర్ లో ఉపాధి హామీలో భాగంగా కందకాల పనిని డీవీవో దత్తాద్రి, ఎంపీడీవో సవితా రెడ్డి తో కలిసి పరిశీలించారు. ఏప్రిల్ మొదటి వారం నుండి కూలీల సంఖ్యను పెంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏపీవో ధర్మారెడ్డి, టి ఏ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య, కూలీలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love