అభిమానికి క్షమాపణలు చెప్పిన అక్కినేని నాగార్జున

నవతెలంగాణ – హైదరాబాద్‌ : టాలీవుడ్‌ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున తన అభిమానికి ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వెళ్తున్న నాగార్జునను కలిసేందుకు ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అభిమానిని ఈడ్చి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయంపై నాగార్జున స్పందించారు. ”ఈ విషయం తన దృష్టికి వచ్చింది.. ఇలా జరిగి ఉండకూడదు..ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాని చెబుతున్నాను !!” అని నాగార్జన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Spread the love